శ్రీ కృష్ణుని అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గా భవాని

58பார்த்தது
శ్రీ కృష్ణుని అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ దుర్గా భవాని
శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి మండలం ఈశ్వరపురం గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవాని అమ్మవారు సోమవారం శ్రీ కృష్ణ పరమాత్మ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి కమలంపేట రాధాకృష్ణ మూర్తి శర్మ ఆధ్వర్యంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకం, అలంకరణ గావించి విశేష పూజలను జరిపారు. దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

தொடர்புடைய செய்தி