ప్రధానమంత్రి జన్మదిన రోజున సేవా కార్యక్రమాలు

71பார்த்தது
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి తెలిపారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను మంగళవారం పంపిణీ చేశారు. విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி