తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: డీఈఓ

71பார்த்தது
ప్రాథమిక పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సదాశివపేట మండలం పెద్దాపూర్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி