సంగారెడ్డి పట్టణం గొల్లగూడెంలో కొలువైవున్న శ్రీ ఆంజనేయ స్వామివారికి శ్రావణమాస ముగింపు పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణమాస చివరి రోజు అమావాస్య సోమవారం సందర్భంగా గొల్లగూడెం గ్రామ ప్రజలు శ్రీ ఆంజనేయ స్వామికి అభిషేకాలు, అలంకరణ గావించి ప్రత్యేక పూజలను నిర్వహించారు.