అమ్మవారికి ఆషాఢ అమావాస్య పూజలు

63பார்த்தது
అమ్మవారికి ఆషాఢ అమావాస్య పూజలు
ఆషాఢమాసం చివరి రోజు అమావాస్య సందర్భంగా సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి సండే మార్కెట్ శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయం ఆదివారం భక్తజన సంద్రమైంది. అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సువాసిని మహిళలు అమ్మవారికి నూతన వస్త్రాలు, సౌభాగ్య ద్రవ్యాలు, ఒడి బియ్యాన్ని సమర్పించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి మొక్కులు సమర్పించుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி