కవలంపేట ఎంకన్న స్వామికి అభిషేక పూజలు

59பார்த்தது
కవలంపేట ఎంకన్న స్వామికి అభిషేక పూజలు
సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామ శివారులోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరులతో స్వామివారి మూలమూర్తులకు అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలంకరణ గావించి వారోత్సవ పూజలను నిర్వహించారు. అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

தொடர்புடைய செய்தி