సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మంత్రికి వినతి

66பார்த்தது
సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని మంత్రికి వినతి
సమగ్ర శిక్షలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిని క్రమబద్దీకరించాలని కోరుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు శుక్రవారం సంగారెడ్డిలో వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు శేషాద్రి మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని చెప్పారు. కార్యక్రమంలో సంఘం నాయకులు దత్తు, రమేష్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி