హరిద్రావర్ణంలో సిద్ది గణనాథుడు

80பார்த்தது
హరిద్రావర్ణంలో సిద్ది గణనాథుడు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గణేష్ గడ్డ ఆలయంలో వినాయక చవితి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని నవరాత్రోత్సవాలు ఘనంగా శనివారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విఘ్నేశ్వరునికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. హరిద్రావర్ణంలో అందంగా అలంకరించబడిన గణేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించేందుకు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி