ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయించాం: మున్సిపల్ చైర్మన్

62பார்த்தது
ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయించాం: మున్సిపల్ చైర్మన్
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం నుండి ప్రణీత్ పనోరమ కాలనీ వరకు 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన స్ట్రీట్ లైట్లను సోమవారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని ప్రధాన రహదారుల్లో వీధి దీపాల ఏర్పాటుకు ప్రణాళిక బద్దంగా నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్యోతి రెడ్డి, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி