రేపు శివ పంచాక్షరి జప యజ్ఞం

73பார்த்தது
శ్రీ జ్యోతిర్ వాస్తు విద్యాపీఠం నిర్వహణలో కంగ్టి లోని సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 12వ తేదీన శివ పంచాక్షరి జప మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దారం సంజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఫసల్వాదిలోని ఆశ్రమం నుంచి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி