కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్ పార్థివదేహానికి శనివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి చేసిన సేవ ఎన్నటికీ మరువలేనిది అని ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని అన్నారు.