పైపులైన్ లీకేజీ.. నిలిచిన నీటి సరఫరా

79பார்த்தது
మునిపల్లి మండలం బస్సా రెడ్డి పల్లి శివారులోని మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీతో గురువారం మంచినీటి సరఫరా నిలిచిపోయింది. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, ఆందోలు- జోగిపేట మున్సిపాలిటీలలోని 266 గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేసినట్లు మిషన్ భగీరథ అధికారులు తెలిపారు. పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయించి శుక్రవారం నుంచి నీటి సరఫరా యధావిధిగా చేస్తామని మిషన్ భగీరథ అధికారి విజయలక్ష్మి తెలిపారు.

தொடர்புடைய செய்தி