అల్లాదుర్గం శివారులో బైక్ స్కిడ్డై కింద పడిన వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం మృతి చెందాడు. 12వ తేదీన రాత్రి 9 గంటలకు బైక్ స్కిడ్డై హనుమాన్లు (42) కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన హనుమాన్లను హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపారు.