పట్టపగలు గూడ్స్ రైల్లో దోపిడీ.. వీడియో వైరల్

59பார்த்தது
అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలు కొందరు నిలిపి ఉంచిన గూడ్స్ రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. కార్లు, ట్రక్కులతో వచ్చి రైల్లోని టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు, ఇతర సామాన్లను ఎత్తుకెళ్లారు. చికాగోలోని లేక్, కిన్జీ స్ట్రీట్స్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తుపాకులతో హెచ్చరించడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలీదు గాని.. ఈ వీడియో వైరల్‌ అవుతోంది.

தொடர்புடைய செய்தி