ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు భారత క్రికెట్ అభిమానులకు షాక్. ఇప్పటికే గాయం కారణంగా బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. ఇక తాజాగా రిషభ్ పంత్ కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. మోకాలి గాయం వల్ల నొప్పితో మైదానంలో పంత్ విలవిల్లాడాడు. ఫిజియో చికిత్స చేస్తుండగా పంత్ నేలపై బాధ పడడం ఈ వీడియోలో చూడొచ్చు. గాయం తీవ్రతపై స్పష్టత రాలేదు. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.