రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలి: గవర్నర్

79பார்த்தது
రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేయాలి: గవర్నర్
తెలంగాణలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతం చేసి, పేదలకు సేవలందించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. శుక్రవారం విద్యానగర్ లోని బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు. అక్కడ అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను పరామర్శించారు. గడ్డిఅన్నారం రెడ్ క్రాస్ సొసైటీ స్థలంలో నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. అందుకు కావలసిన నిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించేలా కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி