ఖననం చేసిన 12 రోజులకు యువతి మృతదేహానికి పోస్టుమార్టం

71பார்த்தது
ఖననం చేసిన 12 రోజులకు యువతి మృతదేహానికి పోస్టుమార్టం
ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని మృతదేహానికి ఖననం చేసిన 12 రోజులకు శవపరీక్ష నిర్వహించడం చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు కు చెందిన దంపతులు ఉపాధి నిమిత్తం మైలార్వేపల్లిలో ఉంటున్నారు. ఈ నెల 17న ఇంటర్ చదివే కుమార్తె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా పోలీసులకు చెప్పకుండా 18న చేగూరులో ఖననం చేశారు. కొద్దిరోజులకు యువతి తండ్రి తన కుమార్తెను ఒకరు ఫోన్లో వేధించారని భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మైలార్వేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఖననం చేసిన చోటే గురువారం అధికారుల పర్యవేక్షణలో పోస్టు మార్టం చేయించారు.

தொடர்புடைய செய்தி