జలమండలి ఎండీ జూమ్ మీటింగ్

77பார்த்தது
జలమండలి ఎండీ జూమ్ మీటింగ్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ జలమండలి డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో ఎండీ అశోక్ రెడ్డి జూమ్ మీటింగ్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. వర్షాల వల్ల కలుషిత నీరు సరఫరా అయ్యే అవకాశమున్న తరుణంలో దానిపై ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి సరఫరా చేసే నీటిలో తగు మోతాదులో క్లోరిన్ ఉండేలా చూసుకోవాలన్నారు. తరచూ సీవరేజీ ఓవర్ ఫ్లో అయ్యే మ్యాన్ హోళ్లను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி