శంషాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మాధవరెడ్డి తెలిపారు. పీజీలో సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఈ నెల 24 సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం నియామకం ఉంటుందన్నారు.