కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. పలు రాష్ట్రాలకు ఏఐసీసీ కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులను నియమిస్తున్నట్టు వెల్లడించింది. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ సెక్రటరీగా సంపత్ కుమార్ను (తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే) పార్టీ కమాండ్ శుక్రవారం నియమించింది. ఇక ఏపీ సెక్రటరీగా గణేష్ కుమార్ యాదవ్, జాయింట్ సెక్రటరీగా పాలక్ వర్మ పేర్లను పార్టీ ప్రకటించింది. హైదరాబాద్ గాంధీభవన్ వర్గాలు ఒక ప్రకటనలో విడుదల చేశారు.