డివిజన్ పరిధిలోని శారదానగర్ లో వర్షపు నీరు రోడ్లపై నిలువకుండా చర్యలు చేపట్టామని హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన డివిజన్ పరిధి శారదానగర్ లో మాన్సూన్ సిబ్బందితో కలిసి పర్యటించారు. కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగింపజేసి వరదనీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఆయన వెంట నరసింహారావు, యాదయ్య, మధు ఉన్నారు.