తెలంగాణలో ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. హైదరాబాద్లో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ధిదారుల ఇళ్లల్లో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని సూచించారు. శ్రీరామనవమి రోజున భద్రాచలంలో లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం చేస్తారని చెప్పారు. సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమని వ్యాఖ్యానించారు.