నేడు గాంధీ ఆసుపత్రికి ప్రొ.సాయిబాబా భౌతికకాయం అప్పగింత

61பார்த்தது
నేడు గాంధీ ఆసుపత్రికి ప్రొ.సాయిబాబా భౌతికకాయం అప్పగింత
అనారోగ్యంతో కన్నుమూసిన విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త, ప్రొ.సాయిబాబా(57) భౌతికకాయాన్ని సోమవారం గాంధీ ఆస్పత్రికి అప్పగించనున్నారు. నిమ్స్‌ ఆసుపత్రి నుంచి ఆయన భౌతికకాయాన్ని ఉదయం 9 గంటలకు గన్‌పార్క్‌కు తీసుకుని వెళ్తామని, అనంతరం మౌలాలిలోని శ్రీనివాస హైట్స్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సన్నిహితుల సందర్శనార్థం ఉంచుతామని, సాయంత్రం 4 గంటలకు గాంధీ ఆసుపత్రి అధికారులకు అప్పగిస్తామని సాయిబాబా సోదరుడు రాందేవ్‌ తెలిపారు.

தொடர்புடைய செய்தி