ప్రధాని నరేంద్ర మోదీ పాంబన్ వంతెన డ్రోన్ విజువల్స్ను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. "రామేశ్వరంలో మరువలేని రామ నవమి! కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రవేశపెట్టడం కూడా చాలా ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో దీనికి సంబంధించిన హైలైట్స్ ఉన్నాయి." అంటూ మోడీ పోస్ట్ చేశారు. ఆదివారం రామేశ్వరంలో పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనతో పాటు రూ.8300 కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను ఆయన చేశారు