పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటన.. 32కు చేరిన మృతులు

75பார்த்தது
పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటన.. 32కు చేరిన మృతులు
అనూహ్య దాడులతో లెబనాన్‌ దేశం వణికిపోతోంది. మొన్న హెజ్‌బొల్లా సభ్యులు ఉపయోగించే వేలాది పేజర్లు పేలిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే.. నిన్న వాకీటాకీలు వరుసగా పేలిపోయాయి. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 32 మంది మృతిచెందగా.. మరో 3,250 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేజర్లు పేలిన ఘటనలో 12 మంది మరణించగా.. బుధవారం నాటి వాకీటాకీల పేలుళ్లలో మరో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி