కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ సినీ నటి, నృత్యకళాకారిణి శోభన ను పద్మభూషణ్ అవార్డు వరించింది. శోభన తెలుగులో అల్లుడుగారు, అభినందన, రుద్రవీణ వంటి సినిమాల్లో నటించారు. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.