జె.సి.ఐ.ఇందూరు ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు

316பார்த்தது
జె.సి.ఐ.ఇందూరు ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలు
నిజామాబాద్ జిల్లా జేసిఐ ఇందూర్ ఆద్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఆదివారం ఉదయం నిజామాబాదు నగరంలోని గాజుల్ పేట్ లో ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి జేసిఐ సభ్యులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జేసిఐ ఇందూర్ అధ్యక్షుడు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ..యువతకు స్పూర్తి ప్రధాత స్వామీ వివేకానందుడని అన్నారు. వివెకానందుని జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ చదివి స్పూర్తి పొందాలని సూచించారు.జేసిఐ ఇందూర్ పూర్వాద్యక్షులు చింతల గంగాదాస్, కార్యదర్శి తక్కూరి హన్మాండ్లు,కోశాధికారి డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్,ఉపాద్యక్షులు కె.శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు కోడూరు పద్మ, జూనియర్ విభాగం అధ్యక్షురాలు కోడూరు సంకీర్తన, ప్రోగ్రామ్ చైర్మెన్ నరహరి నాయక్,ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி