కోవిడ్ ఫ్రంట్ వారియర్స్ కి సన్మానం

361பார்த்தது
కోవిడ్ ఫ్రంట్ వారియర్స్ కి సన్మానం
నగరంలోని కోవిడ్-19 కి సంబంధించి విశిష్ట సేవాలందిస్తు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సి.యమ్.ఓ. మార కీర్తిప్రియ, ఫుడ్ బ్యాంక్ ఫౌండర్ నవీన్ చంటిలను జేసిఐ నిజామాబాద్ ఇందూరు ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా జే. సి.ఐ.ఇందూరు కార్యదర్శి తక్కురి హన్మాండ్లు మాట్లాడుతూ జిల్లాలో జేసిఐ వారోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించామని, చివరి రోజైన మంగళవారం నాడు కోవిడ్-19 విపత్కర పరిస్థితుల్లో సేవలందించిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించామని, విపత్కర పరిస్థితుల్లో సేవాలందించి పలువురికి ఆదర్శంగా నిలిచారని వారిని ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో పూర్వధ్యక్షులు చింతల గంగదాసు, సెక్రటరీ తక్కురి హన్మాండ్లు, కోశాధికారి జమాల్పూర్ రాజశేఖర్, ఆలేఖ్య, పెందోటి చంద్రశేఖర్ , శేఖర్ పందేని తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி