నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ రానున్న రెండు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.