నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిత్యం రద్దీగా ఉండే ఖలీల్వాడి ప్రాంతంలో శుక్రవారం రోడ్డు మీద పార్కింగ్ చేసిన వాహనాలను ట్రాఫిక్ సిఐ వెంకటనారాయణ వెహికల్స్ ని క్రేన్ ద్వారా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాలు నిలబడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దానితోపాటు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని, పార్కింగ్ స్థలలో వాహనం నిలపాలని తెలియజేశారు.