బోధన్ లో వైభవంగా నాగుల పంచమి పండగ

71பார்த்தது
బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివ మందిరం వద్ద గల నాగమ్మ మందిరం వద్దకు మహిళలు, భక్తులు శుక్రవారం నాగుల పంచమి పండుగను పురస్కరించుకొని భారీ సంఖ్యలో చేరుకొని పూజలు నిర్వహించారు. వైభవంగా నాగుల పంచమి పండగను జరుపుకున్నారు. మహిళలు పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగమ్మ తల్లికి ఇష్టపూర్వకమైన నైవేద్యాలను సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు, భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி