నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కురుమ సంఘం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జి వీరయ్య, కందకుర్తి సాయిలు, పోశెట్టి సతీష్, సాయికుమార్, కురుమశంకర్, పోశెట్టి రాజు కాలనీవాసులు భక్తులు పాల్గొన్నారు.