కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం సంగోజిపేట్ తండాకు చెందిన భగవత్ శిరీష శుక్రవారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. లింగంపేట్ మండలానికి చెందిన శిరీషకు సంగోజిపేట్ తండాకు చెందిన నరేష్ తో ఇటీవలే పెళ్లి జరిగింది. ఈ ఆత్మహత్యతో గొడవలు జరిగే సమాచారం అందుకున్న పట్టణ రూరల్ సీఐలు మున్నూరు కృష్ణ, సత్యనారాయణ గౌడ్ చేరుకొని ముందస్తు చర్యలు చేపట్టారు. సంఘటనకు సంబంధించిన మరికొంత సమాచారం తెలియాల్సి వుంది.