బాన్సువాడ మండలంలోని తాడ్కొల్ గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి భారీ వృక్షం ప్రధాన రహదారిపై పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని స్థానికులు ఇచ్చిన సమాచారానికి మాజీ వార్డు సభ్యులు కుమ్మరి రాజు జెసిబితో చెట్టును తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చూశారు. రహదారిపై పడ్డ వృక్షం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మానవత్వంతో వెంటనే స్పందించిన కుమ్మరి రాజును వాహనదారులు అభినందించారు.