ప్రధానమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

66பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుపై భైంసా మండలం లింగా గ్రామంలో ఎంఆర్పీఎస్, అన్నబావు సాటే సంఘం ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోడీ, మంద కృష్ణ మాదిగ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. 30 ఏళ్లుగా వర్గీకరణ కోసం ఎదురు చూసిన కల బీజేపీ ప్రభుత్వం నెరవేర్చిందని అన్నారు. మండల బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி