ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి చేత పి ఆర్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ

578பார்த்தது
ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి చేత పి ఆర్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ
శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నివాసంలో క్యాలెండర్ ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యారంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా అనేక పాఠశాల మౌళిక వసతులు కల్పిస్తుందని పేర్కొన్నారు. పిఆర్టియు సంఘం చాలా పెద్ద సంఘమని పి ఆర్ టి యు ద్వారా అనేకమైన ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారమయ్యాయి అని తెలిపారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి విద్యను అందించి నిర్మల్ జిల్లా పేరు నిలపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులకు కోరారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బివి రమణ రావు జిల్లా అసోసియెట్ అధ్యకురాలు వందన , ముధోల్ నియోజకవర్గం లోని వివిధ మండలాల పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర , జిల్లా, బాధ్యులు మరియు ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி