కుంటాల మండలం కల్లూరు గ్రామంలో ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా నిర్వహించే ప్రీమియర్ లీగ్
క్రికెట్ టోర్నమెంట్ జడ్పీఎస్ఎస్ పాఠశాల గ్రౌండ్లో శనివారం ప్రారంభమైంది. కల్లూరులో ఉన్న క్రీడాకారులు 8 జట్లుగా ఏర్పడి పోటీ పడనున్నాయి. రెండు రోజులు లీగ్ కొనసాగుతుందని విజేత జట్టుకు నగదు పురస్కారంతో పాటు ప్రశంస పత్రం, మెమెంటో అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు.