రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

67பார்த்தது
రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కృషి చేయాలని జన్నారం మండల సెకండ్ ఎస్సై సత్తార్ కోరారు. సోమవారం ఉదయం జన్నారం పట్టణంలోని ధర్మారం చౌరస్తా వద్ద ప్రజలకు, ఆటో డ్రైవర్లకు ఆయన రోడ్డు నియమాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు వారి వాహనాలను పరిమిత వేగంతో నడపాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సి, ఇన్సూరెన్స్ కాగితాలను తప్పకుండా వెంట ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி