చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు కోడి శ్రీనివాసులు నేతృత్వంలో చండూరు చేనేత కార్మిక సంఘం, చేనేత పరిరక్షణ సేవా సమితి(సిపిస్) ఆధ్వర్యంలో చేనేత కార్మికులు శనివారం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే కార్మికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. త్రిఫ్ట్ ఫండ్ కు సంబంధించి పెండింగ్ చెక్కులు వెంటనే విడుదలన్నారు.