వర్షాకాలంలో వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్. ఇజరాత్ ఉన్నిసా అన్నారు. శనివారం మునుగోడు నియోజకవర్గం చల్లవానీకుంట గ్రామాన్ని పరిశీలించి, ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. రోగులకు ఉచిత పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ హెచ్ డాక్టర్ దువ్వా నవీన్, శ్రీధర్, ఏఎన్ఎం పార్వతి, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.