దేశ చరిత్రలోనే గిరిజనులను మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసిన ఘనత
బీజేపీ పార్టీదే అని నల్గొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణంలో గిరిజన మొర్చా సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు మోసం చేసిందని తెలియజేశారు.కాంగ్రెస్ పార్టీ అంటే స్కాముల పార్టీ అని అన్నారు. జానారెడ్డి కుటుంబంలో వాళ్లే
రాజకీయాలు తప్ప వేరే వాళ్ళు
రాజకీయాలు చేసే పరిస్థితి లేదని, ఒక కొడుకు ఎమ్మెల్యే ఒక కొడుకు ఎంపీగా పోటీగా చేస్తుండనీ, వాళ్లకి వారసత్వ
రాజకీయాలు తప్ప ప్రజలపై ప్రేమ లేదని తెలియజేశారు. నల్లగొండలోనే వారసత్వ
రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని కోమటిరెడ్డి బ్రదర్స్ ఉత్తమ్ కుటుంబాలు వాళ్లకు పదవులు మీద తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదని తెలియజేశారు.కావున ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు వేసి ఆశీర్వదించాలని అభివృద్ధిని చూపిస్తానని హామీ ఇచ్చారు.