భారత్లో ఏడాదిలోగా మధ్యంతర ఎన్నికలు వస్తాయని
కాంగ్రెస్ పార్టీ నేత, చత్తీస్ఘఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే ఎంపీలు తదుపరి ప్రధానిగా, ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర
మోదీ వైపు మొగ్గుచూపిన రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ సీఎం యోగి, రాజస్ధాన్ సీఎం భజన్లాల్ శర్మల పదవులకు ఎసరొచ్చిందని అన్నారు.