మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్న గ్రామ ప్రభుత్వ పాఠశాల గేట్ కు ఉన్న ఇనుప చువ్వలను దొంగలు రోజూ ఒకటిగా దొంగిలిస్తున్నారని శుక్రవారం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు చాలా సంవత్సరాల నుండి రక్షణగా ఉన్న గేట్ ను ఈ విధంగా చేయడం హేయమైన చర్య అని గ్రామస్తులు వాపోయారు.