నర్సాపూర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయడం లేదు. దీంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పేలా లేదు. నర్సాపూర్, హైదరాబాద్, తూప్రాన్, సంగారెడ్డి వైపుగా వెళ్లే వాహనదారులకు సిగ్నల్స్ పని చేయకపోవడంతో అడ్డదిడ్డంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ లైట్స్ పునరుద్ధరించాలని కోరారు.