ఆటో డ్రైవర్లకు అవగాహన: ఎస్ఐ రాజు

73பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలపై ఎస్సై రాజు అవగాహన కల్పించారు. మండల పరిధిలోని ఆటోలకు పోలీస్ శాఖ తరపున సీరియల్ నెంబర్ ముద్రించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி