మెదక్ విద్యుత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

348பார்த்தது
మెదక్ జిల్లా విద్యుత్ అధికారి, సూపరింటెండింగ్ ఇంజనీర్ జానకి రాములు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జానకిరాముడు మాట్లాడుతూ..24 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని కొనియాడారు. అదేవిధంగా విద్యుత్ సంస్థలకు జాతీయస్థాయిలో ఏడవ అవార్డులు రావడం హర్షించదగ్గ విషయమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ కిషన్ రావు, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ రంజిత్ సింగ్ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, ప్రసాద్, వెంకన్న, పరమేశ్వర, అశోక్, నగేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி