వారోత్సవాల ముగింపు సభను విజయవంతం చేయండి: సిపిఎం

76பார்த்தது
మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్లో సోమవారం సిపిఎం పార్టీ మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రైతాంగం సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సభను విజయవంతం చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 10 ఐలమ్మ వర్ధంతి నుండి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలు అన్ని మండల కేంద్రాలు వివిధ ప్రాంతాల్లో 17 వరకు కొనసాగుతున్నాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி