మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. అనంతరం కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు వెలిగించిన జ్ఞానమనే దీపం ఎప్పుడూ దారి చూపుతూనే ఉంటుందని పేర్కొన్నారు.