అమ్మ మాట - అంగన్ వాడీ బాటలో భాగంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాబిన్ ఏరియా, గోపాల్ వాడ అంగన్ వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్ రమాదేవి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అంగన్ వాడీ రెండున్నరేళ్లు దాటిన పిల్లలను అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్లు పద్మజ , మల్లీశ్వరి, సరోజ పాల్గొన్నారు.