ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జ్వర బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంచిర్యాల పట్టణంలో ఇంటింటి సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజ్ తో పాటు అధికారులు పలు కాలనీలలో పర్యటించారు. సర్వే, వైద్య శిబిరాల నిర్వహణ తీరును ఆరా తీశారు. 72 బృందాలతో నిత్యం 100 నివాసాల్లో వివరాలు సేకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.